యాప్నగరం

నాగార్జున ఆఖరి కోరిక తీర్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

తనని కలవాలని, తనతో మాట్లాడాలని ఎదురుచూసిన ఓ వీరాభిమాని చివరి కోరిక తీర్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

Samayam Telugu 30 Jul 2016, 8:50 pm
తనని కలవాలని, తనతో మాట్లాడాలని ఎదురుచూసిన ఓ వీరాభిమాని చివరి కోరిక తీర్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అందుకోసం శనివారమే కేరళ వెళ్లాల్సి వున్నప్పటికీ తన ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బెంగుళూరుకు చెందిన నాగార్జున యంగ్ టైగర్‌కి వీరాభిమాని. వీలైతే ఎన్టీఆర్‌ని కలవాలని, మాట్లాడాలనేది నాగార్జున కోరిక. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితిలో వున్న నాగార్జున ఆఖరి కోరిక గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన అభిమాని కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి హడావుడి చేయడం ఇష్టం లేదని చెబుతూ కుటుంబంతో సహా నాగార్జునని తన ఇంటికి ఆహ్వానించారు. తన ఇంటి ఆవరణలోనే నాగార్జునతో 45 నిమిషాలసేపు గడిపిన ఎన్టీఆర్.. అతడికి తాను అంటే ఎందుకు ఇష్టం, ఏంటనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Samayam Telugu jr ntr fulfills his banglore fans last wish
నాగార్జున ఆఖరి కోరిక తీర్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్


నాగార్జునతో మాట్లాడి అతడికి ఓ బహుమతి అందజేశారు. కుటుంబసభ్యులతో నాగార్జున ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన ఎన్టీఆర్... వారికి కూడా కొన్ని బహుమతులు ఇచ్చి సాగనంపినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూట్ కోసమే కేరళ వెళ్లాల్సి వున్నప్పటికీ.. నాగార్జునని కలవడం కోసం ప్రయాణాన్ని ఒకరోజుకు వాయిదా వేసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్ వంటి నటులు సైతం ఇలా తమ అభిమానుల కోరికని తీర్చి వారిని సంతోషపర్చిన వారి జాబితాలో వున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.