యాప్నగరం

సినీ ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదు- ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TNN 19 Sep 2017, 9:01 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మూడు(జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్ర విశేషాలను తెలియజేస్తూనే తన పర్సనల్ ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్నారు.
Samayam Telugu jr ntr ready for a multistarrer movie
సినీ ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదు- ఎన్టీఆర్


తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్న ‘సినీ వారసత్వం’పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్‌ అనేది చాలా ముఖ్యమన్నారు. నటన అనేది వారసత్వంగా వచ్చినా అది ఎంతకాలమో నిలవదని.. తన అభిప్రాయంలో సినీ వారసత్వం పనికి రాదన్నారు. మా తాత, తండ్రి నటులైనా నన్ను హీరో కావాలని వాళ్లు కోరుకోలేదని నా ఇష్ట పూర్వకంగానే హీరోగా అడుగుపెట్టానన్నారు. హీరోగా రాణించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో టాలెంట్ తప్ప మరో మార్గం లేదరన్నారు. మనకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా ప్రేక్షకుడు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు అవేం కనపడవన్నారు.

ఇక తన వైవిద్యభరిత కథలంటే చాలా ఇష్టమని భవిష్యత్‌లో అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ సినిమా చేయడానికైనా తాను సిద్ధం అంటూ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించగలమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.