'జనతా గ్యారేజ్' సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్గా దర్శకుడు బాబీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల ప్రశ్నకు సమాధానం చెప్పాడు ఎన్టీఆర్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని, ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన పాయింట్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించడం. ఈ కథకు కూడా అదే పెద్ద హైలైట్. అటువంటి విషయం సినిమా పట్టాలెక్కక మునుపే బయటకు తెలిసిపోవడం పట్ల ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
దర్శకుడు బాబీను పిలిచి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ.. సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు పొక్కకూడదని.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాబీకు సూచించాడట.
ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని, ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన పాయింట్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించడం. ఈ కథకు కూడా అదే పెద్ద హైలైట్. అటువంటి విషయం సినిమా పట్టాలెక్కక మునుపే బయటకు తెలిసిపోవడం పట్ల ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
దర్శకుడు బాబీను పిలిచి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ.. సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు పొక్కకూడదని.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాబీకు సూచించాడట.