యాప్నగరం

రామయ్య సన్నిధిలో తారక్.. ఎగబడ్డ జనం!

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి వరుస హిట్లతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం భద్రాచలం ఆలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నాడు.

TNN 10 Nov 2017, 12:51 pm
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి వరుస హిట్లతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం భద్రాచలం ఆలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నాడు. భార్య లక్ష్మీప్రణతితో కలసి సీతారామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. స్వామివారి దర్శనానికి అలయంవద్దకు చేరుకున్న తారక్‌ దంపతులకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములకు ఎన్టీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందించి, భద్రాద్రి విశిష్టతను తెలియజేశారు.
Samayam Telugu jr ntr today visited bhadrachalam temple with his family
రామయ్య సన్నిధిలో తారక్.. ఎగబడ్డ జనం!


మరోవైపు, ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోపులాట కూడా జరిగింది. ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎన్టీఆర్ కూడా అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు నిర్మాతలు స్వామి వారిని దర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.