పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న కాటమరాయుడు చిత్రంలోని మూడో పాట ఈ రోజు విడుదలైంది. రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా.. అంటూ సాగే ఈ పాట మాస్ను ఆకట్టుకునేలా ఉంది. అనూప్ రుబెన్స్ స్వరపరిచిన ఈ గీతం మంచి మాస్ బీట్తో సాగుతోంది. రంగు...రంగుల మందేయరా...వేయి ఏనుగల బలమొస్తదిరా అంటూ గాయకుడు ధనుంజయ పాడిన ఈ పాట హుషారుగా సాగుతోంది.
ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కిశోర్ పార్థసానీ (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ పక్కన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తమిళం విజయవంతమైన వేదాళం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న కాటమరాయుడు సినిమాకు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4 విడుదలైన ఈ సినిమా టీజర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
యూట్యూబ్లో విడుదలైన ఈ టీజర్ ఆదివారానికి కోటి మంది వీక్షించగా, 2.52 లక్షల మంది లైక్ చేశారు. దీంతో పవన్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్గా ఇది నిలిచినట్లు సమాచారం. ఫ్యాక్షనిస్టు ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కిశోర్ పార్థసానీ (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ పక్కన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తమిళం విజయవంతమైన వేదాళం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న కాటమరాయుడు సినిమాకు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4 విడుదలైన ఈ సినిమా టీజర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
యూట్యూబ్లో విడుదలైన ఈ టీజర్ ఆదివారానికి కోటి మంది వీక్షించగా, 2.52 లక్షల మంది లైక్ చేశారు. దీంతో పవన్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్గా ఇది నిలిచినట్లు సమాచారం. ఫ్యాక్షనిస్టు ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.