2012లో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో విడుదలైన థ్రిల్లర్ మూవీ 'కహానీ' గుర్తుండే వుంటుంది. ఆ కహానీని మైమరిపించేలా ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్తో మళ్లీ ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు కహానీ లీడింగ్ లేడీ విద్యాబాలన్, డైరెక్టర్ సుజోయ్ ఘోష్. దుర్గా రాణి సింగ్ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ పాత్ర తీరు తెన్నులని చూపిస్తూ తాజాగా ట్రైలర్ని రీలీజ్ చేశారు కహానీ-2 నిర్మాతలు.
మీ కూతురు మిమ్మి కిడ్నాప్ అయ్యిందనే ఫోన్ కాల్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, డ్రామా, సస్పెన్స్తో కనిపించింది. పోలీసు విచారణ అధికారి పాత్రలో కనిపించిన అర్జున్ రామ్పాల్ యాక్షన్ కూడా స్టోరీపై క్యూరియాసిటిని పెంచింది. అన్నింటికిమించి చిన్నారుల్ని కిడ్నాప్ చేసి వారిని హతమార్చే నిందితురాలిగా దుర్గా రాణి సింగ్ పేరు ఆరోపించబడటం ట్రైలర్లో సస్పెన్స్ మరింత ఎక్కువయ్యేలా చేసింది. డిసెంబర్ 2న రిలీజ్ అవనున్న ఈ మూవీలో స్టోరీనే కీలకం కానున్నట్టు 2:34 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
మీ కూతురు మిమ్మి కిడ్నాప్ అయ్యిందనే ఫోన్ కాల్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, డ్రామా, సస్పెన్స్తో కనిపించింది. పోలీసు విచారణ అధికారి పాత్రలో కనిపించిన అర్జున్ రామ్పాల్ యాక్షన్ కూడా స్టోరీపై క్యూరియాసిటిని పెంచింది. అన్నింటికిమించి చిన్నారుల్ని కిడ్నాప్ చేసి వారిని హతమార్చే నిందితురాలిగా దుర్గా రాణి సింగ్ పేరు ఆరోపించబడటం ట్రైలర్లో సస్పెన్స్ మరింత ఎక్కువయ్యేలా చేసింది. డిసెంబర్ 2న రిలీజ్ అవనున్న ఈ మూవీలో స్టోరీనే కీలకం కానున్నట్టు 2:34 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.