యాప్నగరం

ఆ ముచ్చట తీర్చినందుకే గౌతమ్‌ని పెళ్లాడా: కాజల్

తనకు మోకాళ్లపై నిలబడి లవ్ ప్రపోజ్ చేసినందుకే గౌతమ్‌ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. కాబోయే భర్త తన ముచ్చట తీర్చడం ఆనందంగా ఉందన్నారు.

Samayam Telugu 24 Nov 2020, 8:52 am
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కొద్దిరోజుల క్రితం పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ కొత్త జంట అక్కడ తీసుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా తాను గౌతమ్‌ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని చెప్పింది కాజల్.
Samayam Telugu భర్తతో కాజల్


Also Read: కోలీవుడ్‌లో బంపరాఫర్.. సూర్యతో రొమాన్స్ చేయనున్న రష్మిక!

అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలబడి గులాబీ అందించి లవ్ ప్రపోజ్ చేయాలని కోరుకునే దాన్నని.. గౌతమ్ ఆ విధంగానే తన ప్రేమను వ్యక్తపరచడంతో కాదనలేకపోయానని కాజల్ చెప్పుకొచ్చింది. గౌతమ్... తనకు ప్రపోజ్ చేయడానికి ముందే తన పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడని, అయినప్పటికీ మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తాను కండిషన్ పెట్టినట్లు తెలిపింది. తనకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టమని.. అందుకే గౌతమ్‌తో లవ్ ప్రపోజ్ చేయించుకున్న తర్వాతే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పింది. తన ముచ్చట అలా తీర్చినందుకే గౌతమ్‌ని పెళ్లాడానని ఈ చందమామ చెప్పుకొచ్చింది.

Also Read: ‘పుష్ప’ నుంచి విజయ్ ఔట్... లైన్లోకి వచ్చిన అపరిచితుడు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.