యాప్నగరం

మాల్దీవుల్లో మజా చేస్తున్న బాలీవుడ్ జంట..

తాజాగా ఈ హీరోయిన్ మాల్దీవుల్లోని ఓ సముద్ర తీరంలో చెక్క బ్రిడ్జ్‌పై సైక్లింగ్ చేస్తున్న ఓ సూపర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది..

TNN 6 Jun 2017, 2:14 pm
అజయ్ దేవ్‌గన్, కాజోల్ దంపతులు తమ పిల్లలతో కలసి వేసవి నుంచి ఉపశమనం కోసం మాల్దీవుల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకున్న అజయ్ దేవ్‌గన్.. తన పిల్లలు నైసా, యుగ్‌తో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. చల్లటి ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీళ్లు ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని అభిమానులతోనూ పంచుకుంటున్నారు. కాజోల్ తాజాగా మాల్దీవుల్లోని ఓ సముద్ర తీరంలో చెక్క బ్రిడ్జ్‌పై సైక్లింగ్ చేస్తున్న ఓ సూపర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది.
Samayam Telugu kajol goes cycling in maldives
మాల్దీవుల్లో మజా చేస్తున్న బాలీవుడ్ జంట..


అప్పుడప్పుడూ బైక్‌పై రైడ్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది ఈ ‘దిల్‌వాలే’ బ్యూటీ. మాల్దీవుల లాంటి దీవుల్లో అలాంటివి మరింత సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చింది కాజోల్.
  i get along with bikes occasionally A post shared by Kajol Devgan (@kajol) on Jun 5, 2017 at 8:21am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.