ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్ కూడా చేశారు. ‘కళాతపస్వి కె. విశ్వనాథ్కి 2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తున్నారు’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న కె. విశ్వనాథ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న ఆరో తెలుగు వ్యక్తి. గతంలో బి.ఎన్. రెడ్డి (1974), ఎల్వీ ప్రసాద్ (1982), బి. నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), డి. రామానాయుడు (2009) ఈ అవార్డును అందుకున్నారు.
Compliments to 'Kalatapasvi' K. Viswanath for being conferred Dadasaheb Phalke Award for 2016... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 24, 2017
1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పెదపులివర్రు ఈయన స్వగ్రామం. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ స్టూడియోలో టెక్నీషియన్గా పనిచేసిన విశ్వనాథ్.. ఆ తరవాత ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అలాగే కె. బాలచందర్, బాపు వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘ఆత్మగౌరవం’ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన కె.విశ్వనాథ్.. తొలిసినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తరవాత చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ మహిళల ప్రాధాన్యతను చాటిచెప్పే చిత్రాలు కావడం విశేషం.
కె.విశ్వనాథ్లోని కళాత్మక కోణాన్ని బయటపెట్టిన చిత్రం ‘సిరి సిరి మువ్వ’. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్. ఆ తరవాత విశ్వనాథ్ అమ్ములపొదిలో నుంచి వచ్చిన సినిమాలన్నీ సంగీతం పరంగా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. శంకరా భరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణ కమలం, ఆపద్భాందవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి సినిమాలు తెలుగు వారి గుండెల్లో కె.విశ్వనాథ్ చిరకాలం నిలిచిపోయేలా చేసాయి.
1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కళాతపస్వి.. ఆ తరవాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆరు నంది అవార్డులు, తొమ్మిది సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను విశ్వనాథ్ అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడి గానూ చెరిగిపోని ముద్ర వేశారు.
Compliments to 'Kalatapasvi' K. Viswanath for being conferred Dadasaheb Phalke Award for 2016... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 24, 2017
1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పెదపులివర్రు ఈయన స్వగ్రామం. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ స్టూడియోలో టెక్నీషియన్గా పనిచేసిన విశ్వనాథ్.. ఆ తరవాత ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అలాగే కె. బాలచందర్, బాపు వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘ఆత్మగౌరవం’ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన కె.విశ్వనాథ్.. తొలిసినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తరవాత చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ మహిళల ప్రాధాన్యతను చాటిచెప్పే చిత్రాలు కావడం విశేషం.
కె.విశ్వనాథ్లోని కళాత్మక కోణాన్ని బయటపెట్టిన చిత్రం ‘సిరి సిరి మువ్వ’. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్. ఆ తరవాత విశ్వనాథ్ అమ్ములపొదిలో నుంచి వచ్చిన సినిమాలన్నీ సంగీతం పరంగా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. శంకరా భరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణ కమలం, ఆపద్భాందవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి సినిమాలు తెలుగు వారి గుండెల్లో కె.విశ్వనాథ్ చిరకాలం నిలిచిపోయేలా చేసాయి.
1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కళాతపస్వి.. ఆ తరవాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆరు నంది అవార్డులు, తొమ్మిది సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను విశ్వనాథ్ అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడి గానూ చెరిగిపోని ముద్ర వేశారు.