నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జోడీగా నటిస్తున్న ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) రిలీజ్ డేట్ను అఫీషియల్గా ప్రకటించింది. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని మార్చి 23న గ్రాండ్గా విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ అసోసియేషన్లో గతేడాది విడుదలైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పెద్ద సక్సెస్ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీపుల్ మీడియా అసోసియేషన్లో చేసిన సినిమా ‘ఎమ్మెల్యే’ 2017లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సహా అన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను గురువారం నాడు జరుగనున్నాయి. దీంతో షూటింగ్ అనంతర కార్యక్రమాలు ముగియడంతో మార్చి 23న విడుదల విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మా బ్యానర్లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.
దర్శకుడు ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ ''మా ‘ఎమ్మెల్యే’ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. టైటిల్ని చూసి ఇది రాజకీయ సినిమా అనుకోవద్దు. చాలా ఫన్తో కూడుకుని ఉంటుంది. ఫస్టాఫ్ కార్పొరేట్ బ్యాక్డ్రాప్లో సెకండాఫ్ రూరల్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఈసినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో కల్యాణ్రామ్గారికి ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, కాజల్తో పాటు రవి కిషన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ అసోసియేషన్లో గతేడాది విడుదలైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పెద్ద సక్సెస్ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీపుల్ మీడియా అసోసియేషన్లో చేసిన సినిమా ‘ఎమ్మెల్యే’ 2017లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సహా అన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను గురువారం నాడు జరుగనున్నాయి. దీంతో షూటింగ్ అనంతర కార్యక్రమాలు ముగియడంతో మార్చి 23న విడుదల విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మా బ్యానర్లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.
దర్శకుడు ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ ''మా ‘ఎమ్మెల్యే’ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. టైటిల్ని చూసి ఇది రాజకీయ సినిమా అనుకోవద్దు. చాలా ఫన్తో కూడుకుని ఉంటుంది. ఫస్టాఫ్ కార్పొరేట్ బ్యాక్డ్రాప్లో సెకండాఫ్ రూరల్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఈసినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో కల్యాణ్రామ్గారికి ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, కాజల్తో పాటు రవి కిషన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.