యాప్నగరం

'2.0' ఆడియో లాంచ్‌కు ముఖ్య అతిథి..

'2.0' ఆడియో లాంచ్‌కు అతిథిగా స్టార్ హీరోను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ సినిమా పాటలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

TNN 24 Oct 2017, 8:29 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా '2.0'ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని భారీగా ప్లాన్ చేశారు. అక్టోబర్ 27న దుబాయ్‌లో పాటల పండగను వైభవంగా జరపనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే ఈ ఈవెంట్‌కు భారీగా ప్లాన్ చేస్తోంది. ఇండియా నుంచి వచ్చే కొందరు సినీ ప్రముఖులకు దుబాయ్‌కి ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేదికపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తుండటం మరో విశేషం.
Samayam Telugu kamal haasan to be chief guest at 2 0 audio launch
'2.0' ఆడియో లాంచ్‌కు ముఖ్య అతిథి..


అయితే ఈ ఆడియో లాంచ్‌కు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వార్తల్లోకి వచ్చింది. దీనికి అతిథిగా ఓ స్టార్ హీరోను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన చేతుల మీదుగా 2.0 పాటలు విడుదల కానున్నాయని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

దర్శకుడు శంకర్ తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాలకు పెద్ద హీరోలను అతిథులుగా ఆహ్వానించడం సాధారణ విషయమే. అయితే.. కమల్ హాసన్‌ను పిలవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. శంకర్ తన తదుపరి చిత్రాన్ని మన కథానాయకుడితోనే ప్లాన్ చేశాడట. అందుకే ఈ వేడుకకు కమల్‌ను అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.