యాప్నగరం

మోడీ జీ.. ఇలా అయితే మేం సినిమాలు తీయలేం ఇక!

తనలాంటి వాళ్లు సినిమాలు తీయడాన్ని మానుకోవడమే పరిష్కారం అవుతుందని కమల్ వ్యాఖ్యానించారు.

TNN 3 Jun 2017, 1:07 pm
కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానున్న ఏక పన్ను విధానం జీఎస్టీపై స్పందించారు తమిళనటుడు, దర్శక, నిర్మాత కమల్ హాసన్. జీఎస్టీ అమల్లోకి వస్తే సినిమాలపై జాతీయ వ్యాప్తంగా 28 శాతం పన్ను పడనుంది. ఇది సినీ పరిశ్రమకు అమిత భారంగా మారతుందని ఇప్పటికే పలువురు సినీ నిర్మాతలు అంటున్నారు. ఈ విషయంలో వారు ప్రభుత్వ పెద్దలకు పరిస్థితిని వివరిస్తున్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ కూడా స్పందించారు.
Samayam Telugu kamal reaction about impose of gst
మోడీ జీ.. ఇలా అయితే మేం సినిమాలు తీయలేం ఇక!


28 శాతం పన్ను విధిస్తే ప్రాంతీయ సినిమాలకు తీవ్రమైన నష్టాలు వస్తాయని.. వాటిని తట్టుకుని నిలబడి సినిమాలు తీయడం సాధ్యం కాదని, తనలాంటి వాళ్లు సినిమాలు తీయడాన్ని మానుకోవడమే పరిష్కారం అవుతుందని కమల్ వ్యాఖ్యానించారు.

పెద్ద నోట్ల రద్దు సమయంలోనే సినీ పరిశ్రమ కుదుపుకు లోనైందని, నష్టాలను ఎదుర్కొందని ఇప్పుడు 28 శాతంతో జీఎస్టీ అమల్లోకి వస్తే చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని కమల్ అభిప్రాయపడ్డారు. ఈ పన్ను విధానాన్ని సమీక్షించాలని కమల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జీఎస్టీ అమల్లోకి రావడం వల్ల తమిళ చిత్రాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు కూడా లేకుండా పోతుందని కోలీవుడ్ సినీ ప్రముఖులు చెబుతున్నారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి జీఎస్టీపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.