సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎవరిపైనా.. ముఖ్యంగా టాప్ హీరోలపై నోరు జారకుండా ఉండాలని వినికిడి. కానీ.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రూటే సపరేటు. ఆమె తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పేస్తూ సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా నిలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ ‘ఖాన్స్ త్రయం’పై నోరు జారింది. ఏం వారితో సినిమాలు చేస్తేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయా.. నేను వారితో అవకాశం వచ్చినా సినిమాలు చేయనంటూ చెప్పుకొచ్చింది.
‘ఇప్పుడు నా కెరీర్ ఉన్నతంగా ఉంది. గతంలో నేను కూడా ఖాన్లతో చేయాలని ఆశించాను. కానీ తను వెడ్స్ మను సినిమా తర్వాత నా ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఇప్పుడు నా నటన ఆధారంగా దర్శకులు నాకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ ఇమేజ్ చాలు. ఇక ఖాన్లత్రయంతో చేసి వారి ద్వారా వచ్చే క్రేజ్ నాకు అవసరం లేదు. హీరో షారూఖ్ ఖాన్ అంటే నాకు అభిమానం. అయితే ఇప్పటివరకు మేమిద్దరం సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా చేయననే చెప్తాను’ అంటూ వివరించింది ఈ ముద్దుగుమ్మ.
‘ఇప్పుడు నా కెరీర్ ఉన్నతంగా ఉంది. గతంలో నేను కూడా ఖాన్లతో చేయాలని ఆశించాను. కానీ తను వెడ్స్ మను సినిమా తర్వాత నా ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఇప్పుడు నా నటన ఆధారంగా దర్శకులు నాకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ ఇమేజ్ చాలు. ఇక ఖాన్లత్రయంతో చేసి వారి ద్వారా వచ్చే క్రేజ్ నాకు అవసరం లేదు. హీరో షారూఖ్ ఖాన్ అంటే నాకు అభిమానం. అయితే ఇప్పటివరకు మేమిద్దరం సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా చేయననే చెప్తాను’ అంటూ వివరించింది ఈ ముద్దుగుమ్మ.