మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమై ఏడాది దాటిపోయింది. ‘విజేత’ సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. కిందటేడాది జులై 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రెండో సినిమా ఎంపికలో కళ్యాణ్ దేవ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. మంచి కథ కోసం వెయిట్ చేసి మొత్తానికి కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. ఇటీవలే ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు.
Also Read: బిగ్ బాస్ రాహుల్ను వాడేస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో
కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన కొత్త అమ్మాయిని తీసుకున్నారు. కన్నడలో స్టార్ హీరోలందరితో నటించి ప్రస్తుతం బిజీ ఆర్టిస్టు అయిపోయిన రచితా రామ్ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా రచిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్లో ఈ రచిత పాల్గొంటుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది.
Also Read: మెగాస్టార్ను ఫాలో అవుతున్న కార్తి.. వదినతో కలిసి ‘దొంగ’గా వస్తోన్న ‘ఖైదీ’
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వీకే నరేష్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, మహేశ్, షరీఫ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ రాహుల్ను వాడేస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో
కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన కొత్త అమ్మాయిని తీసుకున్నారు. కన్నడలో స్టార్ హీరోలందరితో నటించి ప్రస్తుతం బిజీ ఆర్టిస్టు అయిపోయిన రచితా రామ్ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా రచిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్లో ఈ రచిత పాల్గొంటుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది.
Also Read: మెగాస్టార్ను ఫాలో అవుతున్న కార్తి.. వదినతో కలిసి ‘దొంగ’గా వస్తోన్న ‘ఖైదీ’
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వీకే నరేష్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, మహేశ్, షరీఫ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.