యాప్నగరం

స్టార్ కమెడియన్ మృతి.. ఇండస్ట్రీలో వరుస మరణాలు

సినిమా ఇండస్ట్రీలను ఒకవైపు కరోనా కష్టం వేధిస్తుంటే.. వరుస మరణాలు వెంటాడుతున్నాయి. సోమవారం నాడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్షితో పాటు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి తల్లి కృష్ణ‌వేణి మరణించారు.

Samayam Telugu 7 Apr 2020, 8:33 am
ఒకవైపు కరోనా విజృంభనతో ఇండస్ట్రీలు అల్లాడుతుంటే వరుస మరణాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణ‌వేణి సోమవారం నాడు మరణించగా.. కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu bullet prakash passed away
కమెడియన్ బుల్లెట్ ప్రకాష్


గత కొంత కాలంగా లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కన్నడ స్టార్ కమెడియన్ ‘బుల్లెట్’ ప్రకాశ్ (42) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కాగా, కన్నడ, తమిళ్ మరియు ఇతర భాషల్లో 325 పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్‌ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు.

వైవిధ్యమైన శైలితో ఈయనకు ‘బుల్లెట్’ భాస్కర్ అనే పేరు వచ్చింది. ‘మస్త్‌ మజా మాది’, ‘అయితలకడి’, ‘మల్లిఖార్జున’, ‘ఆర్యన్‌’ సినిమాలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. కన్నడ ‘ధృవ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి.. శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, దర్శన్‌, ఉపేంద్ర, సుదీప్‌ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ మృతికి పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.