యాప్నగరం

ఇకపై పాక్ నటీనటులతో సినిమాలు తీయను -కరణ్

పాక్ నటీనటులు వున్న సినిమాల్ని బ్యాన్ చేస్తాం అని వివిధరాజకీయ, సినీవ్యాపార సంస్థలు చేసిన ప్రకటనతో కరణ్

TNN 18 Oct 2016, 8:51 pm
పాక్ నటీనటులు వున్న సినిమాల్ని బ్యాన్ చేస్తాం అని వివిధ రాజకీయ, సినీవ్యాపార సంస్థలు చేసిన ప్రకటనతో కరణ్ జోహర్ డైరెక్ట్ చేసిన యే దిల్ హై ముష్కిల్ మూవీ చాలా ఇబ్బందుల్లో పడింది. పాక్ నటులు వున్న సినిమాల ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో తమ ఆస్తుల్ని(థియేటర్లు) కాపాడుకోవడానికి పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్టు సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం ప్రకటించడం కరణ్ జోహర్‌ని మరింత ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్‌కి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని కలిసిన కరణ్.. ఆఖరిగా ఈ వివాదంపై అధికారికంగా పెదవి విప్పాడు. ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ కరణ్ జోహర్ 2 నిమిషాల నిడివిగల ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ''గత 2 వారాలుగా దీనిపై ఏమీ మాట్లాడని తాను.... కొంతమంది వ్యక్తులు తనని దేశ ద్రోహిగా ముద్రిస్తుండటం వలన నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది'' అని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. "నాకు నా దేశం కన్నా ఇంకేదీ ముఖ్యం కాదు. నేనెప్పుడు నా దేశభక్తిని ప్రేమ మార్గంలో నా సినిమాలతోనే చాటిచెప్పాలని భావించాను" అని తెలిపాడు కరణ్.
Samayam Telugu karan johar opens about ae dil hai mushkil controversy
ఇకపై పాక్ నటీనటులతో సినిమాలు తీయను -కరణ్


"గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సినిమాని షూట్ చేసిన సమయంలో అప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది. పాక్‌తో సన్నిహత సంబంధాలు కలిగి వుండేందుకు అప్పుడు భారత్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. నేను ఆ ప్రయత్నాన్ని గౌరవించాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితులని కూడా నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇప్పుడు చెబుతోంది ఏంటంటే... ఇకపై పాక్ నటీనటులతో సినిమాలు చేయను. కానీ అదే సమయంలో మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఈ సినిమా కోసం దాదాపు 300లకిపైగా భారతీయులు అహర్నిశలు కృషిచేశారు. ఎంతో చమటోడ్చి శ్రమించారు. ఇటువంటి పరిణామాల కారణంగా వాళ్లు ఇబ్బంది పడటం భావ్యం అని అనుకోను.

ఇండియన్ ఆర్మీని గౌరవిస్తాను. మనల్ని కాపాడటానికి వాళ్లు పడుతున్న శ్రమకిగాను వారికి మనస్పూర్తిగా వందనాలు చెబుతున్నాను. నా దేశ ప్రజలకు, నాకు ముప్పు కలిగించే ఉగ్రవాదం ఏదైనా నేను దానిని తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యంగా మేము కూడా అన్నింటికన్నా ఎక్కువగా దేశాన్ని గౌరవిస్తామనే వాస్తవాన్ని గుర్తించి ఇప్పుడు మేమున్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని అభిప్రాయపడ్డాడు కరణ్. కరణ్ ఏమేం చెప్పాడో అతడి మాటల్లోనే విందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.