యాప్నగరం

రణ్‌బీర్‌తో ఇక సినిమాలు చేయనంటున్న హీరోయిన్

రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా కలిసి నటిస్తున్న జగ్గా జాసూస్ సినిమా విడుదలకి రెడీ అయింది. అనురాగ్ బసు....

TNN 20 Jun 2017, 6:17 pm
రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా కలిసి నటిస్తున్న జగ్గా జాసూస్ సినిమా విడుదలకి రెడీ అయింది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలని అధిగమించి ఎట్టకేలకి జులై 14న ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ జంటని స్క్రీన్‌పై చూడటం కోసం చాలామంది బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, 'జగ్గా జాసూస్' తర్వాత మళ్లీ ఈ కలిసి నటించే అవకాశాలు లేవు కనుక.
Samayam Telugu katrina kaif says she will not work with ranbir kapoor again
రణ్‌బీర్‌తో ఇక సినిమాలు చేయనంటున్న హీరోయిన్


అవును, ఈ సినిమాకు సైన్ చేసేటప్పటికీ రణ్‌బీర్, కత్రినా కైఫ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలెట్టిన తర్వాతే ఈ ఇద్దరి మధ్య అభిప్రాయవిభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. చివరకు బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారు.

ఇదిలావంటే, తాజాగా ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రెస్‌మీట్‌లో ఇకపై రణ్‌బీర్‌తో కలిసి నటించడం కుదరదు అని కత్రినా కూడా చాలా ఓపెన్‌గానే చెప్పేసింది. రణ్‌బీర్‌తో కలిసి పనిచేయడం చాలా డిఫికల్ట్. పైగా అతడు కూడా ఇకపై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేయనని చెప్పినట్టున్నాడు కదా అని అనేసింది కత్రినా కైఫ్. రెండు, మూడేళ్ల క్రితం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా వున్న ఈ జంట ఇప్పుడు ఒకరు వున్న చోట మరొకరు సౌకర్యంగా వుండలేకపోతున్నారు. అదండీ సంగతి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.