యాప్నగరం

Keerthy Suresh: 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్.. లైవ్‌లో క్లారిటీ ఇచ్చిన మహానటి

మహేష్ బాబు 27వ సినిమా 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటిస్తోందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేసింది కీర్తి.

Samayam Telugu 19 Jun 2020, 12:59 pm
''భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు'' లాంటి వరుస భారీ సక్సెస్‌లు అందుకొని సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న మహేష్ బాబు తన 27వ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ మూవీ యూనిట్ త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో హీరోయిన్ వేట ప్రారంభించిన దర్శకనిర్మాతలు మహేష్ సరసన కీర్తి సురేష్‌ని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
Samayam Telugu Keerthy Suresh_ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్.. లైవ్_లో క్లారిటీ ఇచ్చిన మహానటి
Sarkaru Vaari Paata heroine


ముందుగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ పేరును పరిశీలించినప్పటికీ డేట్స్ విషయంలో తేడా రావడంతో దక్షిణాది హీరోయిన్ వైపు మొగ్గుచూపారట పరశురామ్. ఈ మేరకు కీర్తి సురేష్‌తో సంప్రదింపులు జరపగా అవి సక్సెస్ అయ్యాయనే టాక్ బయటకొచ్చింది. అయితే ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియా లైవ్ ప్రోగ్రాంలో కీర్తి సురేష్ సైతం అఫీషియల్‌గా ఒప్పుకోవడంతో మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Also Read: కరోనాతో సీరియల్ నటి మృతి.. బ్రతికుండగానే చంపేశారు.. జయ భట్టాచార్య ఫైర్

ఇటీవలే విడుదలైన 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మహేష్ మెడపై రూపాయి బిళ్ళ కనిపిస్తుండటం సరికొత్త ఆసక్తి రేకెత్తించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ సంగీతం బాణీలు కట్టనున్నారు. అతిత్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూట్ వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.