యాప్నగరం

నటిని కాపాడలేదు.. 45 కోట్లు కట్టాల్సిందే!

హాలీవుడ్ నటి కిమ్‌ కర్దాషియన్‌ను బాత్రూమ్‌లో కట్టేసి.. వజ్రాలతో కూడిన ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులను చోరీ చేశారు.

Samayam Telugu 5 Oct 2018, 8:32 pm
హాలీవుడ్ నటి, యాంకర్ కిమ్ కర్దాషియన్ అపార్ట్‌మెంట్లో చోరీ ఘటనలో ఆమె బాడీగార్డు పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నాడు. నటి కిమ్‌‌ను కాపాడి, ఆమె ఆభరణాలు ఇతరత్రా వస్తులు చోరీకి గురికాకుండా చూసి ఉంటే తమకు 45 కోట్లు (6.1 మిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లేది కాదని అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ (ఏఐజీ) బీమా కంపెనీ అభిప్రాయపడింది. కిమ్ వ్యక్తిగత సంరక్షకుడు పస్కాల్ డువియర్, అతడు పనిచేస్తున్న సంస్థ ఆ 45 కోట్లు చెల్లించాలని బుధవారం దావా వేసింది.
Samayam Telugu Kim and Pascal Duvier


అసలే జరిగిందంటే..
2016 అక్టోబర్‌లో ఓ ఫ్యాషన్‌ షోలో హాజరయ్యేందుకు కిమ్‌ తన పిల్లలను తీసుకుని ప్యారిస్‌కు వెళ్లింది. కిమ్ ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడి తన అపార్ట్‌మెంట్‌లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. కిమ్‌ను బాత్రూమ్‌లో కట్టేసి.. వజ్రాలతో కూడిన ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులను చోరీ చేశారు. అయితే కిమ్‌కు రక్షణ కల్పించాల్సిన బాడీగార్డు పస్కాల్ డువియర్ వేరే పనిమీద బయటకు వెళ్లాడు. అయితే కిమ్‌కు రక్షణ కల్పించేందుకు డువియర్ గానీ, లేక సెక్యూరిటీ సంస్థ గానీ ప్రత్యామ్నాయాన్ని సూచించలేదని ఏఐజీ తమ దావాలో పేర్కొంది.

రక్షణ కల్పిస్తామన్న నిబంధనను సెక్యూరిటీ సంస్థ ఉల్లంఘించడంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని బీమా సంస్థ చెబుతోంది. చోరీకి గురైన కిమ్ ఆభరణాలు, వస్తువుల విలువ 6.1 మిలియన్ డాలర్లు. కాగా, ఆ నగదు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఏఐజీ, నటి కిమ్‌కు అందజేసింది. కిమ్‌కు రక్షణ కల్పించకపోవడంతోనే భారీ చోరీ జరిగి, తాము ఆ మొత్తాన్ని నటికి చెల్లించాల్సి వచ్చిందని కారణాలనూ ఏఐజీ వివరించింది. చోరీ తర్వాత డువియర్‌ను కిమ్ కుటుంబసభ్యులు తొలగించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.