యాప్నగరం

Pawan Kalyanకి ‘కొబ్బరి మట్ట’ టీం చిరు కానుక..

Janasena అధినేత పవన్ కళ్యాణ్‌కు కొబ్బరి మట్ట సినిమా టీం లక్ష రూపాయల విరాళం అందజేసింది. ఈ విషయాన్ని కొబ్బరి మట్ట మూవీ నిర్మాత సాయి రాజేశ్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.

Samayam Telugu 1 Sep 2019, 11:38 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. జనసేనానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురుస్తోంది. మన దేశంలో ట్విట్టర్ ట్రెండ్స్‌ను పవన్ ఫ్యాన్స్ సెట్ చేశారు. ఇదే సమయంలో పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన స్థాపించిన జనసేనకు తోచిన మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ‘కొబ్బరి మట్ట’ టీమ్ జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది
Samayam Telugu pkd


మా టీం ఇచ్చిన మాట ప్రకారం నేను, సంపూర్ణేశ్ బాబు, ఉమా మహేశ్.. జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేశ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సందీప్ పంచకర్లకు చెక్కును పంపించామని ఆయన తెలిపారు. తమ సినిమాను హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కొబ్బరి మట్ట మూవీకి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించారు. సంపూ మెగా ఫ్యాన్ అన్న నాగబాబు.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.12 కోట్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.

కొబ్బరి మట్ట సినిమా హీరో సంపూర్ణేశ్ బాబు ఇటీవలే కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని ఆయన అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.