యాప్నగరం

తమిళ పాలిటిక్స్‌పై కోలీవుడ్ నటులు ఫైర్

తమిళరాజకీయాలపై తమిళ నటీ నటులు మండిపడ్డారు. తమిళ అసెంబ్లీలో శనివారం జరిగిన రచ్చను ప్రపంచం అంతా చూసిందని .. అసెంబ్లీలోనే ఇలా విధ్వంసాలకు పాల్పడితే ప్రజలకు వీరిపై ఎలా నమ్మకం కలుగుతుందంటూ పలువురు నటులు ఆవేదన వ్యక్తం చేశారు.

TNN 18 Feb 2017, 10:44 pm
తమిళరాజకీయాలపై తమిళ నటీ నటులు మండిపడ్డారు. తమిళ అసెంబ్లీలో శనివారం జరిగిన రచ్చను ప్రపంచం అంతా చూసిందని .. అసెంబ్లీలోనే ఇలా విధ్వంసాలకు పాల్పడితే ప్రజలకు వీరిపై ఎలా నమ్మకం కలుగుతుందంటూ పలువురు నటులు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu kollywood actors fire on tamil politics
తమిళ పాలిటిక్స్‌పై కోలీవుడ్ నటులు ఫైర్


అసెంబ్లీలో రాజకీయ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయన్నారు ప్రముఖనటుడు కమల్ హాసన్.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి వచ్చేలా ఉన్నారని ట్వీట్ చేశారు. ఈరోజు వీరి వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ప్రముఖ నటుడు అరవింద్ స్వామి బలపరీక్ష ద్వారా ఎన్నుకోబడిన పళనిస్వామిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని .. ఎవరైనా ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎన్నికైతే అంగీకరిస్తారని అన్నారు.

ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ప్రతిపక్షం లేకుండా విశ్వాస పరీక్ష ఏంటంటూ నటి కుష్బూ ధ్వజమెత్తగా.. తమిళ రాజకీయాలపై పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై గవర్నర్ జోక్యం చేసుకుని తమిళ ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడాలని నటి రాధిక కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.