యాప్నగరం

లాడ్జిలో సీనియర్ హీరోయిన్ నిర్వాకం.. షాకిచ్చిన యజమాని, కేసు నమోదు

సీనియర్ హీరోయిన్ విజయలక్ష్మి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది నెలలుగా లాడ్జిలో ఉంటూ రూ.3లక్షల అద్దె ఎగ్గొట్టారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Samayam Telugu 24 Oct 2020, 2:59 pm
తమిళ సీనియర్ నటి విజయలక్ష్మి‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న ఆమెపై తాజాగా పోలీస్ కేసు నమోదు కావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న విజయ్, సూర్య కలిసి గతంలో ఫ్రెండ్స్’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా విజయలక్ష్మి నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో అర్జున్, జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’లో విజయలక్ష్మి హీరోల చెల్లి పాత్రలో మెరిశారు.
Samayam Telugu విజయలక్ష్మి


Also Read: యూట్యూబ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఊచకోత... టీజర్‌తోనే సంచలనాలు

ఆ తర్వాత వివిధ కారణాలతో కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఓ రాజకీయ నేత తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మళ్లీ వెలుగులోకి వచ్చారు. తదనంతర పరిస్థితులతో బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చిన ఆమె ప్రస్తుతం తిరువన్‌మియూర్ అనే లాడ్జిలో ఉంటున్నారు. ఈ క్రమంతోనే ఓ రాజకీయ నేతతో గొడవపడి లాడ్జిలోనే ఆత్మహత్యాయత్నం చేశారు.

Also Read: అందరినీ కోతుల్లా ఆడిద్దామనుకుని చివరికి తానే జోకర్‌ అయింది: వనితపై నటి ఫైర్

ఆ వ్యవహారం అలా కొనసాగుతుండగానే తాజా లాడ్జి యజమాని విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కొద్ది నెలలుగా లాడ్జి అద్దె చెల్లించడం లేదని, సుమారు రూ.3లక్షల వరకు బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజ

Also Read: నిర్మాతపై అలిగిన శంకర్.. ‘ఇండియన్-2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే యోచన!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.