తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు వెల్లడించారు. తన ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కోటా వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం భావ్యం కాదని వాపోయారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తప్పుడు వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి తన కుటుంబ సభ్యులు కలత చెందారని, అంతా ఫోన్లు చేసి పరామర్శించడం చాలా ఇబ్బంది కలిగించిందని తెలిపారు.
‘‘సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేయడం ఓ వ్యాపారంలా భావిస్తున్నారేమో. ఇటీవల గాయని సుశీలపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆమె కూడా నేను బతికే ఉన్నానని చెప్పుకోవల్సి వచ్చింది. నన్ను నలభై సంవత్సరాల నుంచి ఓ కళాకారుడిగా ప్రేక్షకులు పోషిస్తున్నారు. 70 ఏళ్లు వచ్చాయి. అయినా, నా అదృష్టం కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలేం లేవు’’ అని తెలిపారు.
కోటా ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఓ యూట్యూబ్ చానెల్లో కథనం ప్రచారమవుతోంది. ఇది వైరల్గా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
కోటా నటించిన ‘జవాన్’, ‘బాలకృష్ణుడు’ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. మరో మూడు సినిమాల్లో కూడా కోటా నటిస్తున్నారు.
‘‘సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేయడం ఓ వ్యాపారంలా భావిస్తున్నారేమో. ఇటీవల గాయని సుశీలపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆమె కూడా నేను బతికే ఉన్నానని చెప్పుకోవల్సి వచ్చింది. నన్ను నలభై సంవత్సరాల నుంచి ఓ కళాకారుడిగా ప్రేక్షకులు పోషిస్తున్నారు. 70 ఏళ్లు వచ్చాయి. అయినా, నా అదృష్టం కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలేం లేవు’’ అని తెలిపారు.
కోటా ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఓ యూట్యూబ్ చానెల్లో కథనం ప్రచారమవుతోంది. ఇది వైరల్గా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
కోటా నటించిన ‘జవాన్’, ‘బాలకృష్ణుడు’ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. మరో మూడు సినిమాల్లో కూడా కోటా నటిస్తున్నారు.