యాప్నగరం

ఆ హీరోకి మతిమరుపు, ఏం గుర్తుండవు: కృష్ణ‌వంశీ

తనతో పనిచేసిన వారు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అని అన్నాడు దర్శకుడు

TNN 22 Jul 2017, 8:52 am
​తనతో పనిచేసిన వారు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అని అన్నాడు దర్శకుడు కృష్ణ‌వంశీ. తను దేనికీ రాజీ పడను అని, తనతో పని చేయడం కష్టం అని.. ఇండస్ట్రీలో ఉన్న అభిప్రాయానికి కారణం వాళ్లే అని ఈ దర్శకుడు వ్యాఖ్యానించాడు. తనతో పని చేసిన వాళ్లంతా అలా చేయరు అని, 80 శాతం మంది తనతో పని చేయడం వల్ల పని చేర్చుకున్నామని అంటారని, కేవలం ఇరవై శాతం మంది మాత్రమే.. తనపై దుష్ప్రచారం చేస్తారని కృష్ణ‌వంశీ అన్నాడు. అది వారిలోని లోపమే అని కూడా ఈ దర్శకుడు వ్యాఖ్యానించాడు.
Samayam Telugu krishnavamsi slams a hero
ఆ హీరోకి మతిమరుపు, ఏం గుర్తుండవు: కృష్ణ‌వంశీ


తనతో పనిచేసిన ఒక హీరో ఉన్నాడని, అతడికి ఏమీ గుర్తుండవు అని.. కనీసం రెండు డైలాగులను కూడా గుర్తుంచుకుని చెప్పలేడని, అతడికి మతిమరుపు అని కృష్ణ‌వంశీ అన్నాడు. ‘అలా కాదు బాబు..’ అని తను చెప్పబోతే.. తనపై అలుగుతాడని, అలాంటి వాళ్లే బయటకు వెళ్లి తనపై నెగిటివ్ గా ప్రచారం చేస్తారు.. అని ఈ దర్శకుడు చెప్పారు.

మరి సదరు హీరో ఎవరో మాత్రం కృష్ణ‌వంశీ చెప్పలేదు. తన గత సినిమాల ఫెయిల్యూర్స్ పై మాట్లాడుతూ.. ఫెయిల్ అయితే అయ్యుండొచ్చు కానీ, తలదించుకునే సినిమాలు చేయలేదని అన్నాడు. రామ్ చరణ్ కు ఒక హిట్టు ఇవ్వాల్సి ఉందని, తను బాకీ పడ్డాను అని, అవకాశం దొరికినప్పుడు ఆ బాకీ తీర్చేస్తానని కృష్ణ‌వంశీ వ్యాఖ్యానించాడు. ఈ దర్శకుడి తాజా సినిమా ‘నక్షత్రం’ విడుదలకు సిద్ధంగా అవుతోంది. నోట్ల రద్దు ప్రభావం వల్ల ఈ సినిమా రూపొందించడానికి ఎక్కువ సమయం పట్టిందని కృష్ణ‌వంశీ చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.