యాప్నగరం

Vijay Deverakonda ‘ఖుషీ’ మూవీలోకి మరో హీరోయిన్? సమంత‌కి పోటీ

Vijay Deverakonda's Kushi మూవీ గురించి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాపై గత కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. ఫస్ట్ హీరోయిన్‌గా చేస్తున్న సమంత అనారోగ్యం బారినపడటం.. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ డిజాస్టర్‌‌గా మిగలడం కూడా కారణాలుగా చెప్తున్నారు. అయితే.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఈ మూవీలోకి వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్స్‌ని....

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 5 Dec 2022, 10:35 am

ప్రధానాంశాలు:

  • విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న ఖుషీ మూవీ
  • కానీ ఇటీవల నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్
  • సమంత అనారోగ్యం కూడా ఓ కారణం
  • తాజాగా ఈ సినిమాలోకి మరో హీరోయిన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vijay Deverakonda, Samantha, krithi shetty,
కృతి శెట్టి, విజయ్ దేవరకొండ, సమంత
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న ‘ఖుషీ’ మూవీలోకి మరో హీరోయిన్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా సమంత (Samantha)ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కానీ.. ప్రస్తుతం సమంత ‘మయోసైటిస్’ బారినపడటం.. ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటూ ఉండటంతో ఈ ఖుషీ మూవీ (Kushi Movie) షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.
కానీ.. తాజాగా ‘ఖుషీ’ మూవీలోకి క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి (krithi shetty) చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి ఛాన్స్ ఉందని.. ఈ మేరకు కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో కీలకమైన ఆమె పాత్ర తొలుత నెగటివ్ షేడ్‌లో ఉండి.. ఆ తర్వాత క్లైమాక్స్‌లో పాజిటివ్‌గా ముగియబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు కృతి శెట్టి చేరికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా ఇటీవల రిలీజై.. ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ డిజార్టర్ ప్రభావంతో పూరి జగన్నాథ్‌తో అప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ నుంచి కూడా విజయ్ దేవరకొండ తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలన్నీ ‘ఖుషీ’ మూవీపైనే ఉన్నాయి. కానీ.. ఈ ఏడాదే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

కృతి శెట్టి కెరీర్ కూడా ఇటీవల గాడితప్పింది. ‘ఉప్పెన’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘బంగార్రాజు’తో రేంజ్‌ని పెంచుకుంది. కానీ ఈ ఏడాది వరుసగా రిలీజైన ఆమె మూడు సినిమాలు ‘ది వారియర్’, ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ డిజాస్టర్‌గా మిగిలాయి. దాంతో ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఆశలు కూడా ఈ ఖుషీపైనే ఉండే అవకాశం ఉంది. సమంత మాత్రం ఇటీవల ‘యశోద’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్‌ని అందుకుంది. ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషీ మూవీలో సమంత, కృతి శెట్టి కాంబినేషన్‌లో కూడా కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.