యాప్నగరం

Kushboo: రజినీ సర్ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపర్చింది.. కుష్బూ ఎమోషనల్ ట్వీట్

తన వల్ల ఇతరులు సమస్యలు ఎదుర్కోవడం ఇష్టం లేదని, అందుకే పార్టీ పెట్టడం లేదంటూ రజినీకాంత్ చేసిన ప్రకటనపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కుష్బూ.

Samayam Telugu 29 Dec 2020, 7:12 pm
డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన రజినీకాంత్ ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజినీ వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. రజినీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజినీని కోరారట. ఈ పరిస్థితుల నడుమ రజినీకాంత్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు.
Samayam Telugu రజినీ సర్ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపర్చింది: కుష్బూ
Rajinikanth Kushboo


నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా నష్టం వాటిల్లింది. ఇదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని ఎమోషనల్ అవుతూ రజనీకాంత్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన వల్ల ఇతరులు సమస్యలు ఎదుర్కోవడం ఇష్టం లేదని, అందుకే పార్టీ పెట్టడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాలపై రజినీకాంత్ సంచలనం.. అభిమానులకు క్షమాపణ
ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ నిర్ణయంపై కుష్బూ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. ''డియర్ రజనీ సర్.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపరిచింది. కానీ మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి'' అని కుష్బూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.