యాప్నగరం

ప్రముఖ దర్శకుడు ఎస్పీ జనంథాన్ కన్నుమూత.. శృతి హాసన్, విజయ్ సేతుపతి సంతాపం

'ఇయార్కై' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమై జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్పీ జనంథాన్ కన్నుమూశారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 14 Mar 2021, 1:54 pm

ప్రధానాంశాలు:

  • 'లాభం' డైరెక్టర్ ఎస్పీ జనంథాన్ కన్నుమూత
  • గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలిపిన వైద్యులు
  • దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన శృతి హాసన్, విజయ్ సేతుపతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రముఖ దర్శకుడు ఎస్పీ జనంథాన్ కన్నుమూత
S. P. Jananathan passes away
ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్పీ జనంథాన్ (61) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వారం రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 7 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
ఎస్పీ జనంథాన్ మరణ వార్త తెలిసి శృతి హాసన్, విజయ్ సేతుపతి, జయం రవి సహా తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న జనంథాన్ ప్రాణాలు కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నించాం కానీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, వైద్యం అందిస్తుండగానే గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
Sri Reddy: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆడవాళ్లను అలా పిలిచే ఆయన..! శ్రీ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
2003 సంవత్సరంలో 'ఇయార్కై' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైన ఎస్పీ జనంథాన్.. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు పొందారు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ సాధించిన ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతి, శృతిహాసన్‌తో 'లాభం' మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగానే ఆయన కన్నుమూయడం చిత్ర యూనిట్‌ని విషాదంలో ముంచెత్తింది. 'లవ్ యూ సార్..' అంటూ అయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు విజయ్ సేతుపతి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.