యాప్నగరం

అంత సేపు నయన్ ఎందుకు ఏడ్చినట్లు.. కారణం ఎవరు?

లేడీ సూపర్‌స్టార్ నయనతార వెక్కి వెక్కి ఏడ్చారట. ఇందుకు కారణం ఎవరో ఆమే ఓ సందర్భంలో వెల్లడించారు.

Samayam Telugu 11 Jan 2020, 10:27 am
పవర్‌ఫుల్ పాత్రలతో తన పవరేంటో చిత్ర పరిశ్రమకు చూపించిన నటి నయనతార. ఆమె బయటికి ఎంత బోల్డ్‌గా కనిపించినా మనసు మాత్రం చాలా సున్నితం. అందుకే ప్రపంచంలోనే తనకు ఇష్టమైన వ్యక్తి కోసం నయన్ కన్నీరుపెట్టుకున్నారు. ఆ వ్యక్తి విఘ్నేష్ శివన్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ వ్యక్తి నయన్ అన్న కూతురు ఏంజిలినా. అవును, మేనకోడలు ఏంజిలినా అంటే నయన్‌కు ప్రాణం అట. అంతేకాదు నయన్ జీవితంలో ఏంజిలినా లక్కీ చార్మ్.
Samayam Telugu nayanthara
నయనతార


ఎందుకంటే ఏంజిలినా పుట్టిన తర్వాతే నయన్‌కు అన్నీ కలిసొచ్చాయి. ప్రతీ క్రిస్మస్ పండుగను నయన్ తన మేనకోడలితోనే జరుపుకునేవారు. కానీ 2019లో మాత్రం ఏంజిలినా వద్ద నయన్ ఉండలేకపోయారట. ఈ విషయాన్ని నయన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో నయన్.. తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు. ఏంజిలినా పక్కన లేనందుకు నయన్ దాదాపు గంట సేపు వెక్కి వెక్కి ఏడ్చారట. దీనిని బట్టే అర్థమవుతోంది నయన్‌ది ఎంత సున్నితమైన మనసో.

READ ALSO: రష్మికను ఇంటర్వ్యూ చేసిన సితార: యాంకర్లకే పోటీనిచ్చేలా ఉందిగా

ఇకపోతే సూపర్‌స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన ‘దర్బార్’ సినిమా గురువారం విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ప్రస్తుతం నయన్.. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నయన్ అమ్మవారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నయన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

READ ALSO: అన్నీ తెలిసే చేస్తోంది.. దీపికా పదుకోన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్మృతి ఇరానీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.