యాప్నగరం

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఎలా లాక్కున్నారో మూవీలో చూపిస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు.

Samayam Telugu 21 Oct 2018, 7:00 pm
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఎలా ఉండబోతుంది, అసలు ఎలాంటి విషయాలను మూవీలో చూపించబోతున్నారన్న ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో మొదలైంది. విజయదశమిని పురస్కరించుకుని సినిమా విషయాలను తిరుమల వెంకన్న సన్నిదిలో డైరెక్టర్ వర్మ వివరించిన విషయం తెలిసిందే. అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ఎన్ని సినిమాలు చేసినా.. అసలైన బయోపిక్‌ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి అన్నారు.
Samayam Telugu Lakshmi’s NTR


ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహం ఈ మూవీలో చూపిస్తామని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు ఎలా లాక్కున్నారో అందరికీ తెలుస్తుందన్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో వాస్తవాలు బయటకురావడం వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేకుండా ఎన్టీఆర్‌ ఎలా మరణించారో ప్రజలకు దర్శకుడు వర్మ చూపిస్తారని నమ్ముతున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. టీడీపీ నేతలకు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరు చెబితే వణుకు పుడుతుందన్నారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రకటించిన తర్వాత చాలా రోజులకు ప్రాజెక్టు పనులు చేపట్టిన వర్మ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు పాత్ర కోసం ఓ వ్యక్తిని వెతికిన వర్మ, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సమాచారమిస్తే 10 లక్షల నగదు రివార్డ్ అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.