యాప్నగరం

Lakshmi's NTR: 5 గంటలకు వర్మ ఏం చేయబోతున్నాడో?

లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ వర్థంతి(జనవరి 18) రోజున సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జీవం పోసుకోనుంది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Samayam Telugu 18 Jan 2019, 12:58 pm

ప్రధానాంశాలు:

  • తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఓ ప్రకటన చేయనున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు.
  • వర్మ ఏం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
  • ఇందుకోసం సాయంత్రం 5 గంటల వరకు ఆగాల్సిందే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ramgopal varma
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత ఘటనల ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే రెండు పాటలను వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో వెన్నుపోటు సాంగ్‌పై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో టీడీపీ నేతలు వర్మపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రల ఫస్ట్‌లుక్‌లను కూడా వర్మ విడుదల చేశారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ వర్థంతి(జనవరి 18) రోజున సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జీవం పోసుకోనుంది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే వర్మ ఏం చేయబోతున్నారోనని ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారా? లేక ఏకంగా టీజరే రిలీజ్ చేస్తారా? అంటూ అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ‘నేను సంచలనం కోసం ఏదీ చేయను.. నేను ఏం చేసినా సంచలనమే’ అన్న ధోరణిలో ఉండే రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సంబంధించిన చేసే ఆ ప్రకటన ఏంటో తెలియాలంటే సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.