యాప్నగరం

దివంగత హీరోయిన్ దివ్యభారతి తల్లి మృతి

దివంగత హీరోయిన్ దివ్యభారతి తల్లి మీటా భారతి కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 28 Apr 2018, 9:39 pm
దివంగత హీరోయిన్ దివ్యభారతి తల్లి మీటా భారతి కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 20న మీటా భారతి మరణించినట్లు మృతురాలి కుటుంబ బంధువుల్లో ఒకరైన కైనాత్‌ ఆరోరా మీడియాకు తెలిపారు.
Samayam Telugu దివ్యభారతి తల్లి

తొలిముద్దు, బొబ్బిలిరాజా, చిట్టెమ్మమొగుడు, రౌడీ అల్లుడు చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన దివ్యభారతి తెలుగునాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించింది దివ్యభారతి అతి తక్కవ కాలంలోనే పాపులర్ హీరోయిన్ అయ్యారు. సక్సెఫుల్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో విరజిల్లుతున్న దివ్యభారతి 1993 ఏప్రిల్‌ 5న ముంబై వెర్‌సోవాలోని ఓ అపార్ట్మెంట్ పై నుండి పడి మరణించారు. ఇప్పటికీ ఆమె మరణంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఇక కూతురు మరణంతో కృంగిపోయి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె తల్లి మీటా భారతి అనారోగ్య కారణాలతో మరణించడం వారి కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.