యాప్నగరం

అయ్యా సామి.. 27 ఏళ్ల తరవాత మళ్లీ ఏసుదాస్, బాలు పాట!

గానగంధర్వులు అనగానే మనకు గుర్తొచ్చేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాస్. వీరిద్దరూ ఎవరికి వారే దిగ్గజాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు.

TNN 8 Feb 2018, 9:58 am
గానగంధర్వులు అనగానే మనకు గుర్తొచ్చేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాస్. వీరిద్దరూ ఎవరికి వారే దిగ్గజాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. అలాంటి మధుర గాయకులు కలిసి పాడితే ఆ పాట మరింత అద్భుతంగా ఉంటుంది. అప్పుడెప్పుడో 1991లో వచ్చిన ‘దళపతి’ సినిమాలో ‘సింగారాల పైరుల్లోన..’ అనే పాట వీరిద్దరూ కలిసి ఆలపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఆ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్.
Samayam Telugu legendary singers kj yesudas sp balasubrahmanyam sing together after 27 years
అయ్యా సామి.. 27 ఏళ్ల తరవాత మళ్లీ ఏసుదాస్, బాలు పాట!


అయితే ఇప్పుడు మళ్లీ ఈ గానగంధర్వుల స్వరాలు ఒకే పాటలో వినే అదృష్టం సంగీత ప్రేమికులకు దక్కింది. ‘కెని-కినార్’ అనే ద్విభాషా సినిమా (కెని - తమిళం, కినార్ - మలయాళం) కోసం 27 ఏళ్ల తర్వాత ఏసుదాస్, బాలు కలిసి పాడారు. ‘అయ్యా సామి..’ అంటూ సాగే ఈ తమిళ పాట అద్భుతంగా ఉంది. ఎం.జయచంద్రన్ సంగీతం అందించిన ఈ పాట మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. వయసు పెరిగినా బాలు, ఏసుదాస్ గానంలో ఎలాంటి తేడా లేదు. యువ గాయకులకు పోటీగా ఎంతో ఉత్సాహంగా ఈ దిగ్గజ ద్వయం పాటను ఆలపించింది.

జయప్రద, రేవతి, పసుపతి, అర్చన, నాజర్, పార్వతి నంబియార్, జాయ్ మాథ్యూస్, అను హసన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఎం.ఎ. నిషద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గృహిణి పాత్రలో జయప్రద, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ పాత్రలో రేవతి కనిపించనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.