‘భారతీయుడు 2’ ఘటన: తప్పంతావారిదే అన్న కమల్.. నిందలు వేయొద్దు అంటున్న నిర్మాణ సంస్థ
ఇటీవల ‘భారతీయుడు 2’ సెట్స్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సెట్లో నిలిపిన భారీ క్రేన్ మీద పడటంతో లైట్మెన్, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడికక్కడే చనిపోయారు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, దర్శకుడు శంకర్ వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే తప్పంతా నిర్మాణ సంస్థదే అన్నట్లు కమల్ మాట్లాడుతున్నారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ కమల్కు గట్టిగా సమాధానం ఇచ్చింది.
తప్పంతా వారిదేనన్న కమల్
‘భారతీయుడు 2’ సెట్స్లో జరిగిన ప్రమాదం విషయంలో తప్పంతా లైకా ప్రొడక్షన్స్దే అన్నట్లుగా కమల్ మాట్లాడారు. అంతేకాదు సెట్స్లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని విషయాల్లోనూ భద్రత కల్పిస్తేనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటాం అని లైకా ప్రొడక్షన్స్కు లేఖ రాసారు. అప్పటివరకు ఎవ్వరూ షూటింగ్లో పాల్గొనరు అని చెప్పారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్పూర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.