యాప్నగరం

Pawan Kalyan నిర్ణయం ఏపీకి దిక్సూచి, నాగబాబుకు సపోర్ట్ చేస్తా: నరేశ్

మా ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేసిన నాగబాబుకు మద్దతునిస్తున్నానని నరేశ్ తెలిపారు. పవన్ నిర్ణయం రాష్ట్రానికి దిక్సూచి అవుతుందన్నారు.

Samayam Telugu 24 Mar 2019, 6:12 pm
‘మా’ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్‌కు నాగబాబు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్యానెల్ విజయం సులువైంది. ఎన్నికల్లో తమ ఓటమికి కారణమైన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీరాజా ఇప్పటికే వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి నాగబాబుకు వ్యతిరేకంగా నర్సాపురంలో ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నర్సాపురం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబుకు తన సపోర్ట్ ఉంటుందని మా అధ్యక్షుడు నరేశ్ తెలిపారు.
Samayam Telugu pk-babu


చిరంజీవి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చెన్నైలో ఎదురెదురు ఇళ్లలో ఉండేవన్న నరేశ్.. ఇరు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. నాగబాబు నిక్కచ్చిగా మాట్లాడతారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ గెలుపోటముల గురించి తనకు సంబంధం లేదన్న నరేశ్.. ఆయన చేస్తున్న సేవను అభిమానిస్తున్నానని తెలిపారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి దిక్సూచిలా ఉంటుందని నమ్ముతున్నానని చెప్పారు. యువతను మేల్కొలిపే లక్షణాలు పవన్‌లో ఉన్నాయన్నారు.

ఇటీవలే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నరేశ్.. ‘మా’ సభ్యులు మార్పు కోరుకోవడ వల్లే అధ్యక్షుడిని అయ్యానన్నారు. ఇక నుంచి అసోసియేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందించడం కోసం ప్రెస్‌మీట్లు పెట్టబోమని ఆయన చెప్పారు. నాగబాబు సలహా మేరకు టీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసి.. ఆ ఛానెనల్ ద్వారా వివరాలను వెల్లడిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.