యాప్నగరం

చిరుని కలిసిన ‘మా ’అధ్యక్షుడు

ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు.

TNN 20 Mar 2017, 2:44 pm
ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.
Samayam Telugu maa president sivaji raja met chiranjeevi
చిరుని కలిసిన ‘మా ’అధ్యక్షుడు


మా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత చిరుని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో రాజేంద్రప్రసాద్ కూడా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత చిరుని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. కాగా ప్రస్తుతం శివాజీరాజా మా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత మా అసోషియేషన్‌తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి మా అధ్యక్షునిగా పనిచేయడానికి రాజేంద్రప్రసాద్ ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో ‘మా’ అసోషియేషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మా అసోషియేషన్ సభ్యులు చిరుతో పాటు.. ఇటీవల దర్శకరత్న దాసరి నారాయాణరావుని సైతం కలిసి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.