యాప్నగరం

KTR సర్.. గాంధీలో నిర్లక్ష్యం నా మిత్రుడ్ని చంపేసింది: నాగ్ అశ్విన్

‘గవర్నమెంట్ హాస్పటల్ అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి’ కేటీఆర్ సార్..

Samayam Telugu 27 Nov 2018, 6:49 pm
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనటానికి ఇదో ఉదాహరణ. ‘గవర్నమెంట్ హాస్పటల్ అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి’ కేటీఆర్ సార్ అంటూ.. తన మిత్రుడి మరణానికి కారణాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్‌ చేశారు ‘మహానటి’ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్.
Samayam Telugu నాగ్ అశ్విన్


నా మిత్రుడు, ప్రముఖ కెమెరామెన్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో ఆసుపత్రిలో ఎవరూ అందుబాటులో లేరు. వాళ్ల పేరెంట్స్ స్ట్రెక్చర్‌పై తీసుకువెళ్లారు. వైద్యం కోసం మూడు గంటల పాటు కాళ్లు అరిగేలా తిరిగారు. ఎవరూ పట్టించుకోలేదు. చావు బతుకుల మధ్య కొట్టిమిట్టిలాడిన నా స్నేహితుడు మరణించాడు. ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా వేరే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి ఉంటే నా మిత్రుడు బతికే వాడు. చనిపోయిన నా మిత్రుడు గొప్ప కెమెరామెన్. అతనికి మంచి భవిష్యత్ ఉంది.

అలాంటి నా మిత్రుడు వైద్యం అందక చనిపోవడం అనేది ఘోరమైన సంఘటన. అదే హాస్పటల్‌లో నా చెల్లెలు కూడా పనిచేస్తుంది. ఈ హాస్పటల్‌కి ఎందుకు తీసుకువచ్చారు. వేరే హాస్పటల్‌కి తీసుకుని వెళ్లాల్సింది అని అంది. రాష్ట్ర రాజధానిలో ఇలా జరగటం చాలా దారుణం. వైద్యం అందక చనిపోకూడదు. ప్రాణాలు కాపాడలేని ఆసుపత్రులు ఎందుకు? పేదల ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం. దీనిపై ఎవర్ని ప్రశ్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మరణశాసనాలు కాకూడదని చెప్పడానికి ఏం చేయాలో చెప్పండి’ అంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రికి తన గోడును విన్నవించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.