అమరావతిలో మహానటి మూవీ యూనిట్ సందడి చేసింది. ప్రజా దర్బార్ హాల్లో బృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా సీఎం అందర్ని అభినందించి.. ఘనంగా సన్మానించారు. సావిత్ర జీవితం ఆధారంగా మహానటి సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశించారు బాబు. కీర్తి సురేష్ కూడా సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించారని అభినందించారు. కష్టాల్లో ఉన్న వాళ్లకు సాయపడాలనే సావిత్రి జీవితం అందరికి ఆదర్శమని.. ఆమెది రాజధాని ప్రాంతమైన అమరావతి కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రాజెక్టును టేకప్ చేయడం అంత సులభం కాదని.. నిర్మాతలు స్వప్న, ప్రియాంకతో పాటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్లపై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాకు పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామన్నారు సీఎం. దీనిపై స్పందించిన నిర్మాత అశ్విని దత్.. ప్రభుత్వం మహానటికి పన్ను మినహాయింపు కల్పిస్తే.. ఆ మొత్తం రాజధాని నిర్మాణానికే ఇస్తామన్నారు. అలాగే వైజయంతి మూవీస్ తరఫున రూ.50 లక్షల చెక్ను రాజధాని నిర్మాణం కోసం స్వప్న దత్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, గోవింద రాజులు, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, మ్యూజిక్ మిక్కీ జే మేయర్ కూడా హాజరయ్యారు.
ఈ సినిమాకు పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామన్నారు సీఎం. దీనిపై స్పందించిన నిర్మాత అశ్విని దత్.. ప్రభుత్వం మహానటికి పన్ను మినహాయింపు కల్పిస్తే.. ఆ మొత్తం రాజధాని నిర్మాణానికే ఇస్తామన్నారు. అలాగే వైజయంతి మూవీస్ తరఫున రూ.50 లక్షల చెక్ను రాజధాని నిర్మాణం కోసం స్వప్న దత్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, గోవింద రాజులు, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, మ్యూజిక్ మిక్కీ జే మేయర్ కూడా హాజరయ్యారు.