లక్స్.. ఈ పేరు వినగానే కుర్రకారు కళ్లల్లో కత్తిలాంటి హీరోయిన్లు కదలాడుతూ ఉంటారు. ఎప్పుడో 1909లో భారత్కు వచ్చిన ఈ బ్యూటీ బ్రాండ్ ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది సినీ తారలు లక్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రేక్షకులను మెప్పించారు. తారల సబ్బుగా ప్రాచుర్యం పొందిన లక్స్.. అమ్మకాల్లోనే అగ్రస్థానంలో నిలుచుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్రాండ్కు మార్కెట్లో డిమాండ్ ఉందంటే దానికి కారణం సినీ తారలే. ఈ సౌందర్య సాధనానికి తొలి బ్రాండ్ అంబాసిడర్గా అప్పటి బాలీవుడ్ హీరోయిన్ లీలా ఛట్నీస్ వ్యవహరించారు. ఆ తరవాత హేమా మాలిని, శ్రీదేవీ, మధుబాల, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా వంటి స్టార్ హీరోయిన్లు లక్స్ పాపలుగా ఓ వెలుగు వెలిగారు.
దేశంలోన్ని అన్ని భాషల ప్రజలను ఆకర్షించడానికి ప్రాంతీయ భాషల్లోనూ లక్స్ ప్రచారం అప్పటి నుంచే మొదలైంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మహానటి సావిత్రి లక్స్ ప్రకటనలో మెరిశారు. తెలుగు నుంచి లక్స్ ప్రచారకర్తగా వ్యవహరించిన తొలి నటి సావిత్రి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లక్స్ సబ్బు డబ్బాపై సావిత్రి ఫొటో దాని కింద సావిత్రి గణేషన్ అని పేరు ఉండేదట. ఇది 1960 కాలం నాటి మాట. ఆ తరవాత దక్షిణాది నుంచి జయప్రద, ఆసిన్, శ్రియా శరణ్, కాజల్ అగర్వాల్, సమంత లక్స్ ప్రచారకర్తలగా పనిచేశారు. అయితే తెలుగు నుంచి సావిత్రి తొలి లక్స్ బ్యూటీ అని చాలా మందికి తెలియని విషయం. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా లేవు. అయితే తెలుగులో సావిత్రి కంటే ముందు లక్స్ యాడ్ చేసినట్లు కూడా సమాచారం లేదు. కాబట్టి తెలుగు తొలి లక్స్ బ్యూటీ సావిత్రి అనే ఫిక్స్ అయిపోవచ్చు.
ఇదిలా ఉంటే.. సావిత్రి జీవిత విశేషాలతో ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తున్నారు. నేడు సావిత్రి జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు చిత్రబృందం ఓ సర్ప్రైజ్ను ప్లాన్ చేసింది. ఈ మేరకు కీర్తి సురేశ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్పై నిర్మిస్తున్న ‘మహానటి’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, క్రిష్, తరుణ్ భాస్కర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే, భానుప్రియ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
A small surprise from team #Mahanati #NadigaiyarThilagam on this occasion of #Savitri Garu’s Birthday! 🎁☺️ Can’t wait for you to watch this ! 😃 @VyjayanthiFilms pic.twitter.com/R482yIJURH — Keerthy Suresh (@KeerthyOfficial) December 6, 2017
దేశంలోన్ని అన్ని భాషల ప్రజలను ఆకర్షించడానికి ప్రాంతీయ భాషల్లోనూ లక్స్ ప్రచారం అప్పటి నుంచే మొదలైంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మహానటి సావిత్రి లక్స్ ప్రకటనలో మెరిశారు. తెలుగు నుంచి లక్స్ ప్రచారకర్తగా వ్యవహరించిన తొలి నటి సావిత్రి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లక్స్ సబ్బు డబ్బాపై సావిత్రి ఫొటో దాని కింద సావిత్రి గణేషన్ అని పేరు ఉండేదట. ఇది 1960 కాలం నాటి మాట. ఆ తరవాత దక్షిణాది నుంచి జయప్రద, ఆసిన్, శ్రియా శరణ్, కాజల్ అగర్వాల్, సమంత లక్స్ ప్రచారకర్తలగా పనిచేశారు. అయితే తెలుగు నుంచి సావిత్రి తొలి లక్స్ బ్యూటీ అని చాలా మందికి తెలియని విషయం. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా లేవు. అయితే తెలుగులో సావిత్రి కంటే ముందు లక్స్ యాడ్ చేసినట్లు కూడా సమాచారం లేదు. కాబట్టి తెలుగు తొలి లక్స్ బ్యూటీ సావిత్రి అనే ఫిక్స్ అయిపోవచ్చు.
ఇదిలా ఉంటే.. సావిత్రి జీవిత విశేషాలతో ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తున్నారు. నేడు సావిత్రి జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు చిత్రబృందం ఓ సర్ప్రైజ్ను ప్లాన్ చేసింది. ఈ మేరకు కీర్తి సురేశ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్పై నిర్మిస్తున్న ‘మహానటి’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, క్రిష్, తరుణ్ భాస్కర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే, భానుప్రియ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
A small surprise from team #Mahanati #NadigaiyarThilagam on this occasion of #Savitri Garu’s Birthday! 🎁☺️ Can’t wait for you to watch this ! 😃 @VyjayanthiFilms pic.twitter.com/R482yIJURH — Keerthy Suresh (@KeerthyOfficial) December 6, 2017