ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. తన అర్ధాంగి నమ్రతా శిరోధ్కర్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన మహేష్ బాబు.. గతంలో తాము తీసుకున్న ఒక ఫొటోని షేర్ చేశారు. ‘నా ఫ్రెండ్, నా ప్రపంచం’ అని అందులో రాసుకొచ్చిన ఈ సూపర్ స్టార్.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నమత్రా అని శుభాకాంక్షలు తెలిపారు.
1998లో బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన నమత్రా.. ఆ తర్వాత 2000లో తొలిసారి తెలుగులో నటించింది. మహేష్ బాబు మూడో చిత్రమైన వంశీ సినిమాతో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట దాదాపు ఐదేళ్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు.
ఇటీవల ‘భరత్ అను నేను’ సినిమాతో మంచి హిట్ని అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
1998లో బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన నమత్రా.. ఆ తర్వాత 2000లో తొలిసారి తెలుగులో నటించింది. మహేష్ బాబు మూడో చిత్రమైన వంశీ సినిమాతో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట దాదాపు ఐదేళ్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు.
ఇటీవల ‘భరత్ అను నేను’ సినిమాతో మంచి హిట్ని అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.