యాప్నగరం

‘ఇది మాకు కావాల్సిన ఆరంభం’.. మీరాభాయ్ చాను విజయంపై మహేష్, పవన్ రియాక్షన్

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నిటి దృష్టి ‘ఒలింపిక్స్’ క్రీడపైనే ఉన్నది. ఇందులో తమ దేశం వాళ్లు ఎన్ని పతకాలు సాధిస్తారు అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇండియా ఈ క్రీడల్లో బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయ్ చాను భారత్‌కి రజత పతాకం తీసుకొచ్చింది.

Samayam Telugu 24 Jul 2021, 8:13 pm
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్‌లో మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. స్నాచ్‌లో 87 కేజీలను లిప్ట్ చేసి.. క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలను లిప్ట్ చేయడం ద్వారా భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది. మొత్తంగా 202 కిలోలను మీరాబాయి లిప్ట్ చేయగా.. చైనా క్రీడాకారిణి జిహు ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ మొత్తంగా 210 కేజీలను లిప్ట్ చేసింది.
Samayam Telugu పవన్ కళ్యాణ్, మీరాభాయ్ చాను, మహేష్ బాబు
Pawan Kalyan, Mirabhai Chanu, Mahesh Babu


ఈ సందర్భంగా మీరాభాయ్ కృషి ప్రోత్సహిస్తూ.. సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. భారత్‌కు మెడల్ సాధించిన ఆమెను అభినందిస్తూ.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి క్షణం కోసమే కదా.. ఎంతోకాలంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తుంది అంటూ మహేశ్ పేర్కొన్నారు. ‘ఇది అందరూ కోరుకొనే ఆరంభం.. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతాకం సొంతం చేసుకున్న మీరాభాయ్ చానుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్షన్ ఇప్పుడే మొదలైంది’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబుతో పాటు.. పవర్‌స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కూడా మీరాభాయ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన సందేశాన్ని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి మెడల్ సాధించినందుకు మీరాభాయ్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని.. జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.