యాప్నగరం

ఈమధ్య కాలంలో ఇంత స్టైలిష్ ట్రైలర్ చూడలేదన్న మహేష్ బాబు

సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన శమంతకమణి సినిమా ట్రైలర్‌ని...

Samayam Telugu 1 Jul 2017, 5:24 pm
సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన శమంతకమణి సినిమా ట్రైలర్‌ని హీరో మహేష్ బాబు ఆకాశానికెత్తేశారు. ఈమధ్య కాలంలో ఇంత మంచి స్టైలిష్ ట్రైలర్‌ని తాను చూడనేలేదని ట్వీట్ చేశారు మహేష్ బాబు. నిన్న రిలీజైన ఈ ట్రైలర్‌ని ఇప్పటికే హాఫ్ మిలియన్ వ్యూయర్స్ వీక్షించగా.. తాజాగా మహేష్ బాబు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్ ఈ ట్రైలర్‌కి మరింత బూస్టింగ్ ఇవ్వనున్నాయి.
Samayam Telugu mahesh babu appreciates shamanthakamani trailer
ఈమధ్య కాలంలో ఇంత స్టైలిష్ ట్రైలర్ చూడలేదన్న మహేష్ బాబు

One of the most stylish trailers I've seen in recent times. Thumbs up to #Shamantakamani & @isudheerbabu https://t.co/1eMkPTLFRU— Mahesh Babu (@urstrulyMahesh) July 1, 2017
దాదాపు 2 నిమిషాల నిడివికలిగిన ఈ ట్రైలర్ చివర్లో రాజేంద్ర ప్రసాద్ కొట్టిన ఓ డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. "మన కుర్రాళ్లందరికీ ఈ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో" అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ కొట్టడం.. అదే సమయంలో ''నువ్వు యూత్ ఏంటి" అన్నట్టుగా సందీప్ కిషన్, ఆది ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్ అనిపించాయి.

శ్రీరాం ఆదిత్యా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సుమన్, ఇంద్రజ, చాందిని చౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జూలై 14న రిలీజ్ కానున్న శమంతమణి చిత్రంలో నారా రోహిత్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.