యాప్నగరం

కరోనాపై పోరాటం: మహేష్ బాబు కోటి విరాళం

సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం అందించారు.

Samayam Telugu 26 Mar 2020, 4:16 pm
కరోనా వైరస్‌‌ను ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న కార్యక్రమాలకు టాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. అలాగే, రామ్ చరణ్ కూడా రూ.70 లక్షల విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వీరి జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు.
Samayam Telugu MaheshBabu
మహేష్ బాబు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు మహేష్ బాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదాం. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దాం. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మానవత్వం పెరుగుతుంది, మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం’’ అని మహేష్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.