యాప్నగరం

ఆ వీరులకు వందనం.. కేరళకు మహేష్‌బాబు సాయం

భారీ వర్షాలు, వరదలకు కేరళ రాష్ట్రం విలవిల్లాడుతోంది. ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Samayam Telugu 19 Aug 2018, 12:00 pm
భారీ వర్షాలు, వరదలకు కేరళ రాష్ట్రం విలవిల్లాడుతోంది. ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని 80 శాతానికి పైగా భూభాగం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 100 ఏళ్లలో ఇంత భయంకరమైన వరదలు కేరళలో రాలేదు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 385 మంది చనిపోయారు. 3.14 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్టీఆర్ఆఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ ఇతర రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఎంతో మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాయి.
Samayam Telugu Mahesh_Babu


కాగా, రెస్క్యూ బృందాల కష్టాన్ని, ధైర్య సాహసాలను కొనియాడుతూ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఆదివారం ట్వీట్ చేశారు. ‘కేరళ వరదల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారందరికీ వందనం. భూభాగం కనిపించని చోట ఎంతో కష్టపడి ప్రజలను రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇతర రెస్క్యూ దళాలకు సెల్యూట్’ అంటూ మహేష్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, వరదల్లో చిక్కుకున్న కేరళకు రూ.25 లక్షల సహాయాన్ని మహేష్‌బాబు ప్రకటించారు. కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని మహేష్ బదిలీ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ కుటుంబం కేరళకు రూ.51 లక్షలు డొనేట్ చేసింది. అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) రూ.10 లక్షలు సాయం చేసింది. ఇక అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్, రామ్ చరణ్ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువచేసే మెడిసిన్స్‌ను కేరళకు పంపారు. తెలుగు సినీ ప్రముఖులే కాకుండా కేరళ సినీ స్టార్స్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేషన్లు పంపారు. కేరళ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) రూ.10 లక్షలు ప్రకటించింది. మమ్ముట్టి రూ.10 లక్షలు, మోహన్ లాల్ రూ.25 లక్షలు డొనేట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.