సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను ఇప్పుడు తమిళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా తమిళనాడులోని థియేటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలలపాటు మూతబడిన థియేటర్లను తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. తమిళనాడులో మాత్రం మంగళవారం నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, అక్కడ కొత్త సినిమాలేవీ ప్రస్తుతం విడుదల కావడంలేదు.
Also Read: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్: దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిపోయిందంట!
ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవీ మీడియా కన్సల్టెన్సీ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. తమిళంలో ఈ సినిమా టైటిల్ ‘ఇవనకు సరియానా ఆల్ ఇళ్లై’. ‘స్పైడర్’ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్లో అడుగుపెట్టారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా తమిళనాట మహేష్కు మార్కెట్ ఏర్పడింది. అందుకే, ప్రస్తుతం అక్కడ కొత్త సినిమాలు ఏమీ లేవు కాబట్టి థియేటర్లు కూడా కరువు ఉండదు కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ను వదులుతున్నారు.
లాక్డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలలపాటు మూతబడిన థియేటర్లను తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. తమిళనాడులో మాత్రం మంగళవారం నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, అక్కడ కొత్త సినిమాలేవీ ప్రస్తుతం విడుదల కావడంలేదు.
Also Read: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్: దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిపోయిందంట!
ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అనువాదం చేసి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవీ మీడియా కన్సల్టెన్సీ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. తమిళంలో ఈ సినిమా టైటిల్ ‘ఇవనకు సరియానా ఆల్ ఇళ్లై’. ‘స్పైడర్’ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్లో అడుగుపెట్టారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా తమిళనాట మహేష్కు మార్కెట్ ఏర్పడింది. అందుకే, ప్రస్తుతం అక్కడ కొత్త సినిమాలు ఏమీ లేవు కాబట్టి థియేటర్లు కూడా కరువు ఉండదు కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ను వదులుతున్నారు.