యాప్నగరం

'క్రిమినల్' డైరెక్టర్ నుంచి మరో తెలుగు సినిమా!

22 ఏళ్ల క్రితం తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రిమినల్ సినిమా అప్పట్లో..

Samayam Telugu 28 May 2017, 7:58 pm
22 ఏళ్ల క్రితం తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రిమినల్ సినిమా అప్పట్లో ఓ సంచలనం. 'తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో..' అంటూ సాగే రొమాంటిక్ మెలోడి ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేని విరహ గీతమే! తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు... ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రముఖ ఫిలింమేకర్‌గా బిజీగా వున్న మహేష్ భట్. 'క్రిమినల్' తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయని మహేష్ భట్‌కి ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ టాలీవుడ్‌పై ప్రేమ కలిగినట్టు అనిపిస్తోంది.
Samayam Telugu mahesh bhatt to produce telugu film under kunal kohli direction
'క్రిమినల్' డైరెక్టర్ నుంచి మరో తెలుగు సినిమా!


అవును, మహేష్ భట్ ఓ తెలుగు సినిమాను తీయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈసారి దర్శకుడిగా కాకుండా నిర్మాతగానే సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాడట. మరో విశేషం ఏంటంటే.. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ (ఫనా), హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, షాహీద్ కపూర్ వంటి లీడ్ స్టార్స్‌‌ని డైరెక్ట్ చేసిన కునాల్ కోహ్లీ ఈ తెలుగు సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కోసం తమన్నాని, మరో ప్రధాన పాత్ర కోసం సందీప్ కిషన్‌ని ఎంపిక చేసుకున్నారు మహేష్ భట్, కునాల్ కోహ్లీలు. ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం లండన్‌లోనే జరగనున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.