యాప్నగరం

‘కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

TNN 16 Nov 2017, 2:34 pm
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడంపై ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, ఈ అంశంపై సినీ క్రిటిక్ మహేశ్ కత్తి ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు.
Samayam Telugu mahesh kathi comments against mega family for nandi awards
‘కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’


కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకండీ అవార్డులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'మీ కాపు సామ్రాజ్యాన్ని పవన్ కల్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా' అంటూ సెటైర్ వేశాడు. పవన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ పప్పులు, బెల్లాలు పంచుకోండి అంటూ కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ అభిమానులు ఉద్దేశించి పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మహేశ్ కత్తి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మేమంతా బాగానే కలిసి ఉంటాం. మా మధ్య వ్యక్తిగత వైరాలు ఉండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాని ఫ్యాన్స్ అనే వాళ్లు వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. నాయనలారా... మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్‌ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలవుతారంటూ కామెంట్ పెట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.