యాప్నగరం

ఫ్యాన్స్ చివరకు మీరే వెధవలవుతారు.. మహేశ్ కత్తి!

జబర్దస్త్ షోలో హైపర్ ఆది తనపై వేసిన సెటైర్లకు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్ని రోజులు కూడా తిరగక ముందే అదే ఆదితో కలసి ఫొటో దిగాడు మహేశ్.

TNN 16 Nov 2017, 12:09 pm
జబర్దస్త్ షోలో హైపర్ ఆది తనపై వేసిన సెటైర్లకు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్ని రోజులు కూడా తిరగక ముందే అదే ఆదితో కలసి ఫొటో దిగాడు మహేశ్. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 'లండన్ బాబులు' ప్రీమియర్ షోకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేశ్, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆదితో దిగిన ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన కత్తి మహేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశాడు.
Samayam Telugu mahesh kathi comments against pawan kalyan fans
ఫ్యాన్స్ చివరకు మీరే వెధవలవుతారు.. మహేశ్ కత్తి!


"మేమంతా బాగానే కలిసి ఉంటాం. మా మధ్య వ్యక్తిగత వైరాలు ఉండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాని ఫ్యాన్స్ అనే వాళ్లు వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. నాయనలారా... మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్‌ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలవుతారంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దీనిపై కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ సిగ్గుపడాలి కానీ, మీరు మాత్రం కాదంటారా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మహేశ్ కత్తి.... సిగ్గుపడేలా చేస్తోంది ఫ్యాన్స్ మేము కాదని బదులిచ్చారు.

హైపర్ ఆది జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనపై వేసిన సెటర్లపై విమ‌ర్శ‌లు చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంశంపై కూడా మహేశ్ కత్తి ఓ టీవీకి ఇంటర్వ్యూలో స్పందించారు. త‌న అభిమానులు చేస్తోన్న వికృత చేష్ట‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రోత్స‌హిస్తున్నాడ‌ని మ‌హేశ్ క‌త్తి ఆరోపించారు. త‌న అభిమానులు చేస్తోన్న ప‌నుల‌ను ఖండించ‌కుండా, వాటిపై ఏమీ మాట్లాడ‌కుండా గుంబంనంగా ఉంటూ ప్రోత్స‌హిస్తున్నార‌ని దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.