తనకు రెండేళ్ల క్రితమే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీలో అవకాశం వచ్చిందని మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకు 'సలార్' కథ చెప్పారని.. క్యారెక్టర్ నచ్చడంతో చేస్తానని చెప్పానని తెలిపారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా తన సినిమాల డేట్స్ మారిపోవడంతో సలార్ మూవీలో నటించలేనని ప్రశాంత్ నీల్కు చెప్పానన్నారు. షాజీ కైలాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'కడువా'. ఈ సినిమా జూన్ 30న ఆడియన్స్ ముందుకు రానుండగా.. శనివారం హైదరాబాద్లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చేయాలని తనకూ ఉందని.. కానీ డేట్స్ విషయంలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తానని అన్నారు. ప్రభాస్ సలార్ మూవీలో కీలక పాత్ర వచ్చినా.. అనుకోని పరిస్థితుల వల్ల చేయలేనని చెప్పానన్నారు. అయితే కరోనా కారణంగా సలార్ మూవీ షూటింగ్ డేట్స్ విషయంలోనూ మార్పులు జరిగాయని.. ఇప్పుడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ను కలుస్తున్నానని.. అన్ని కుదిరితే సలార్ మూవీలో భాగస్వామి అవుతానని చెప్పారు.
తాను తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని పృథ్వీరాజ్ అన్నారు. తెలుగులో నటించడమే కాకుండా.. డైరెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. చాలా మంది తనను కొచ్చికి వచ్చి కలుస్తున్నారని.. తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాలని కోరుతున్నారని తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు బిజినెస్ మోడల్గా నిలిచిందంటూ చెప్పుకొచ్చాడు ఈ మలయాళం హీరో.
తాను తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని పృథ్వీరాజ్ అన్నారు. తెలుగులో నటించడమే కాకుండా.. డైరెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. చాలా మంది తనను కొచ్చికి వచ్చి కలుస్తున్నారని.. తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాలని కోరుతున్నారని తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు బిజినెస్ మోడల్గా నిలిచిందంటూ చెప్పుకొచ్చాడు ఈ మలయాళం హీరో.