మలయాళ సూపర్ స్టార్, మలయాళ నటీనటుల సంఘం(ఏఎమ్ఎమ్ఏ) అధ్యక్షుడు మోహన్ లాల్కు సాటి నటీనటుల నుంచి మరో షాక్ తగిలింది. ఇటీవల మరో నటుడు దిలీప్కు ఏఎమ్ఎమ్ఏలో సభ్యత్వాన్ని పునరుద్ధరించడం పట్ల మోహన్ లాల్ పై నటీనటుల నుంచి నిరసన వైఖరి కొనసాగుతూ ఉంది. అది ఏకపక్ష నిర్ణయం అని మోహన్ లాల్ పై విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక నటిని అపహరించిన ఆమెపై దాడి చేసిన కేసులో నిందితుడు అయిన దిలీప్ను మొదట సంఘం నుంచి బహిష్కరించారు. అనంతరం ఆ కేసులు ఎటూ తేలకనే బహిష్కరణను ఎత్తివేశారు. దీంతో సంఘం అధ్యక్షుడు అయిన లాల్ పై విమర్శల వర్షం కురుస్తోంది.
ముందుగా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ కొంతమంది నటీమణులు ఏఎమ్ఎమ్ఏలోని తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు మరి కొంతమంది నటీనటుల నుంచి లాల్ పై నిరసన వ్యక్తం అవుతోంది. ఈ సారి కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి లాల్ హాజరు కాబోతుండటంపై నటీనటులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి లాల్ కు అతిథిగా ఆహ్వానం అందింది.
దీన్ని తప్పుపడుతూ దర్శకుడు బీజూకుమార్ దామోదరన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. నటిపై దాడి కేసులో నిందితుడు అయిన దిలీప్ కు వత్తాసు పలుకుతూ మోహన్ లాల్ నటీనటుల నిరసనను ఎదుర్కొంటున్నారని, అలాంటి వ్యక్తికి ఎలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు అని బీజూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మోహన్ లాల్కు ఆహ్వానం అందించినందుకు నిరసనగా నటీనటులమంతా ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం వందమంది నటీనటులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ప్రకాష్ రాజ్,మాధవన్,రీమా కళింగల్, గీతూ మోహన్ దాస్,శ్రుతి హరిహరన్ తదితరులు ఉన్నారని సమాచారం.
ముందుగా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ కొంతమంది నటీమణులు ఏఎమ్ఎమ్ఏలోని తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు మరి కొంతమంది నటీనటుల నుంచి లాల్ పై నిరసన వ్యక్తం అవుతోంది. ఈ సారి కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి లాల్ హాజరు కాబోతుండటంపై నటీనటులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి లాల్ కు అతిథిగా ఆహ్వానం అందింది.
దీన్ని తప్పుపడుతూ దర్శకుడు బీజూకుమార్ దామోదరన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. నటిపై దాడి కేసులో నిందితుడు అయిన దిలీప్ కు వత్తాసు పలుకుతూ మోహన్ లాల్ నటీనటుల నిరసనను ఎదుర్కొంటున్నారని, అలాంటి వ్యక్తికి ఎలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు అని బీజూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మోహన్ లాల్కు ఆహ్వానం అందించినందుకు నిరసనగా నటీనటులమంతా ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం వందమంది నటీనటులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ప్రకాష్ రాజ్,మాధవన్,రీమా కళింగల్, గీతూ మోహన్ దాస్,శ్రుతి హరిహరన్ తదితరులు ఉన్నారని సమాచారం.