చేనేత కార్మికుల కష్టాలను తగ్గించడం కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ఆధారం తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. 157 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. సినిమా ఎలా ఉండనుందో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చింది. మల్లేశం లవ్ స్టోరీ, ఫ్రెండ్స్తో సరాదాగా సాగే ఘటనలు.. తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రం కనిపెట్టే క్రమంలో పడే శ్రమ, ఎదుర్కొన్న ఛీత్కారాలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
స్కూళ్లో పిల్లలు చిరంజీవి సినిమా స్టోరీ చెప్పే సీన్ నుంచి మొదలైన ట్రైలర్... చివర్లో ‘ముందుంది ముసళ్ల పండుగ... సినిమా చూసి దీవించుండ్రి నిండుగా’... అని ప్రియదర్శి చెప్పే డైలాగ్తో ముగుస్తుంది.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా... ఇక్కడి యాస, పీర్ల పండగ, జానపద గేయాలను డైరెక్టర్ రాజ్ ఆర్ స్క్రీన్ మీద చూపించారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా.. మల్లేశం జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్ననం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా.. డైరెక్టర్ రాజ్ ఆర్, శ్రీ అధికారి సంయుక్తంగా నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి జోడిగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించారు. ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.
గత ఫిబ్రవరిలోనే ‘మల్లేశం’ ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం తన తల్లి కష్టాన్ని చూడలేక.. ఏడేళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రాన్ని కనిపెట్టారు. 2011లో దానిపై పేటెంట్ హక్కు పొందారు. అదే ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కింది.
స్కూళ్లో పిల్లలు చిరంజీవి సినిమా స్టోరీ చెప్పే సీన్ నుంచి మొదలైన ట్రైలర్... చివర్లో ‘ముందుంది ముసళ్ల పండుగ... సినిమా చూసి దీవించుండ్రి నిండుగా’... అని ప్రియదర్శి చెప్పే డైలాగ్తో ముగుస్తుంది.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా... ఇక్కడి యాస, పీర్ల పండగ, జానపద గేయాలను డైరెక్టర్ రాజ్ ఆర్ స్క్రీన్ మీద చూపించారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా.. మల్లేశం జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్ననం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
గత ఫిబ్రవరిలోనే ‘మల్లేశం’ ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం తన తల్లి కష్టాన్ని చూడలేక.. ఏడేళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రాన్ని కనిపెట్టారు. 2011లో దానిపై పేటెంట్ హక్కు పొందారు. అదే ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కింది.